హైదరాబాద్: నగరంలోని రామంతపూర్లో విషాదం చోటుచేసుకుంది. పెండ్లయిన ఐదు నెలలకే నవదంపతులు తనువుచాలించారు. సాయిగౌడ్, నవనీత ఐదు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. రామంతపూర్లోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా, శుక్రవారం రాత్రి దంపతులిద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే శనివారం ఉదయం పొద్దుపోయినప్పటికీ ఇంట్లో నుంచి ఎవరూ బయటికి రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా సాయిగౌడ్ ఉరివేసుకొని ఉన్నాడు. నవనీత విషం తాగినట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నది.