హైదరాబాద్: నగర శివార్లలోని కీసరలో విషాదం చోటుచేసుకుంది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.