సిటీబ్యూరో: కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్ వాతావరణం మరోసారి వేడెక్కింది. మొన్నటి వరకు చెదురుమదురు వానలతో కొంత చల్లబడిన వాతావరణం.. రెండు మూడు రోజులుగా క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వేడెక్కుతోంది.
శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 40.0, కనిష్ఠం 27.8 డిగ్రీలు, గాలిలో తేమ 31శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావం గ్రేటర్పై ఉండే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.