మారేడ్పల్లి, నవంబర్ 26: భారత పౌరులందరికి సమాన హక్కులను కల్పిస్తూ..ప్రతి ఒక్కరి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం నేడు ఆమోదించబడిన రోజుగా దేశ ప్రజలు పండుగ వాతావరణంలో జరుపుకోవడం సంతోషకరమని ఎమ్మెల్యే సాయన్న అన్నారు. శనివారం కంటోన్మెంట్ నియోజకవర్గం పికెట్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే సాయన్న పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరిని ఒకే తాటి పై నడిపించే రాజ్యాంగం మనదన్నారు. రాజ్యాంగం ఆమోదించబడి నేటికి 73 సంవత్సరాలు పూర్తయ్యాయన్నారు. కార్యక్రమంలో మాజీ బోర్డు సభ్యురాలు నళిని కిరణ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, సదానంద్గౌడ్, సంతోష్ పనస , భాస్కర్, దేవుపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే కుమార్తె నివేదిత తదితరులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్, నవంబర్ 26: బోయిన్పల్లి చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆరో వార్డులోని సీతారాంపురంలో అంబేద్కర్ విగ్రహానికి బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్, సీతాఫల్మండి డివిజన్లోని అంబేద్కర్ విగ్రహానికి కార్పొరేటర్ సామల హేమ పూలమాల వేసి నివాళుర్పించారు. నేతలు ముప్పిడి మధుకర్, జంగిలి రాజు, రావుల సతీశ్, నర్సింహ, సతీశ్, యాదగిరి, శ్రీనివాస్, ప్రభుగుప్త, రాజు, మధు, సురేశ్, హన్మంతరావు, రమేశ్, విజయ్, శ్రావణ్, సన్ని, అనిల్, తారీఖ్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 26: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఉస్మానియా యూనివర్సిటీ, ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఓయూలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రీసర్చ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఓయూ ఆర్ట్స్ కళాశాలలో ప్రత్యేక ప్రసంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగం హెడ్ ప్రొఫెసర్ అఫ్రోజ్ ఆలం మాట్లాడుతూ వివిధ దేశాలలో ప్రజాస్వామ్యం అమలులోకి వచ్చేందుకు జరిగిన పరిణామాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గణేశ్, అంబేద్కర్ రీసర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ కొండా నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఇఫ్లూలో నిర్వహించిన కార్యక్రమంలో వీసీ, యూజీసీ సభ్యుడు ప్రొఫెసర్ సురేశ్కుమార్ రాజ్యాంగ పీఠికను చదివారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పౌరులందరూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, విలువలు, బాధ్యతతో జీవించడమే మనము అంబేద్కర్కు ఇచ్చే ఘన నివాళి అని అభిప్రాయపడ్డారు.
బొల్లారం,నవంబర్ 26: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్ రెండో వార్డు అన్నానగర్ లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేవులపల్లి శ్రీనివాస్,పొన్నాల బాబు,నాగరాజు,ప్రకాశ్,గంగుల శ్రీనివాస్,మల్లేశ్,మొగిలి,ప్రవీణ్,ఎల్లేశ్ పాల్గొన్నారు.
అడ్డగుట్ట, నవంబర్ 26: మెట్టుగూడ చౌరస్తాలోని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి కార్పొరేటర్ రాసూరి సునీత రమేశ్ పూలమాల వేసి నివాళులర్పించారు.