వెంగళరావునగర్, ఆగస్టు 10 : జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. మంగళవారం వెంగళరావునగర్ డివిజన్ మసీదుగడ్డ వద్ద రూ. 21 లక్షల వ్యయంతో నిర్మించిన మూడు సీవరేజీ లైన్ల పనులను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ డివిజన్ కార్పొరేటర్తో దేదీప్య విజయ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయల కల్పన కోసం అధిక ప్రాధాన్యతనిచ్చి పనులను చేపట్టి పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
దశలవారీగా అభివృద్ది కార్యక్రమాలు చేపడ్తున్నామని.. అభివృద్దితో పాటు సంక్షేమం కోసం పాటుపడ్తున్నామని అన్నారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత మంచినీటి పథకానికి సంబంధించి కరపత్రాలను పంచి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ రమేష్, వర్క్ ఇన్ స్పెక్టర్ శంకర్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి వేణు, మాజీ కార్పొరేటర్ శ్యామ్రావు, వేణుగోపాల్ యాదవ్, చిన్న రమేష్, నవాజ్, అఫ్సర్, సత్యనారాయణ, పూజారి బాలరాజు, శంకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.