హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ (BC Bandh) ప్రశాంతంగా కొనసాగుతున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీసీ సంఘాలు, వివిధ పార్టీల నాయకులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ అంబర్పేటలో అఖిలపక్ష నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సీనియర్ నేత వీ. హనుమంత రావు (V. Hanumantha Rao), కాంగ్రెస్తోపాటు బీఆర్ఎస్, సీపీఐ, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బ్యానర్ పట్టుకుని హనుమంత రావు ర్యాలీ ముందు వరుసలో నడుస్తున్నారు. ఈ క్రమంలో బ్యానర్ కాళ్లకు అడ్డుతగలడంతో ఒక్కసారిగా కిందపడిపోయారు. వెంటనే ఆయన్ను నాయకులు పైకి లేపి సపర్యలు చేశారు.