Hyderabad | మూసాపేట, మార్చి 22: యజమానికి తెలియకుండా అపార్టుమెంట్లోని మూడు ఫ్లాట్స్లను అద్దెకిచ్చి యాజమానిని భయబ్రాంతులకు గురిచేస్తున్న ముగ్గురిపై కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జి.వాసవి, పాండురంగారావు దంపతులకు కూకట్పల్లి వివేకానంద నగర్కాలనీలోని తీక్ష రెసిడెన్సీలో 102, 403, 502 ఫ్లాట్స్కు 24 ఫిబ్రవరి 2022 చట్టపరంగా పూర్తి యాజమాన్య హక్కులు పొందారు.
వాసవి వద్ద సూపర్వైజర్గా పనిచేస్తున్న బాలేశ్ బుధవారం అపార్టుమెంట్లోకి వెళ్లి చూడగా రెండు ఫ్లాట్స్లో అద్దెకు దిగారు. వారిని విచారించగా శంకర్ అనే వ్యక్తి తమకు అద్దెకు ఇచ్చారని తెలిపారు. దీంతో శంకర్ను ప్రశ్నించగా తాను కాంగ్రెస్ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు మనిషినని, అపార్టుమెంట్లోకి వెళితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. గతంలో సైతం పద్మారావు అనుచురుడు సుదర్శన్ అపార్టుమెంట్లోకి రావద్దని బెదిరించినట్లు బాలేశ్ తెలిపాడు. వీరితో తనకు ప్రాణహాని ఉన్నదని బాలేశ్ కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు గొట్టిముక్కల పద్మారావు, శంకర్, సుదర్శన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.