మహేశ్వరం, అక్టోబర్ 27: మహేశ్వరంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం అమీర్పేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నుంచి 30 మంది కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై రోజురోజుకూ బీఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు స్థానం లేకుండా పోయిందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు పూటకోమాట మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలోనే కుల, మత ఘర్షణలు లేకుండా ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.
నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న నన్ను నియోజకవర్గం ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారు బ్రహ్మచారి, చంద్రయ్య, పద్మమ్మ, బాబు, యాదయ్య, మల్లేశ్, నాగేశ్, శివాజీ, సురేశ్, మైపాల్, సుధాకర్, బాలకృష్ణ, ప్రవీణ్, కృష్ణమాచారి, జ్ఞానేశ్వర్, శ్రీశైలం, భూపాల్, తిరుపతి ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కుమారి రాయప్ప, ఉపసర్పంచ్ పోతుల నర్సింగ్ పటేల్, గ్రామ శాఖ అధ్యక్షుడు పి.వెంకటేశం, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కల యాదగిరిగౌడ్, కో-ఆప్షన్ సభ్యుడు ఆవుల అశోక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవవారం, వార్డు సభ్యులు యాదయ్య, మల్లేశ్, వెంకటేశ్, మచేందర్ నాయకులు కుమార్, జగన్ ప్రభాకర్, సత్తయ్య, శ్రీను, మల్లేశ్, రాజు, రాములు పాల్గొన్నారు.
ప్రతిపక్షాల అడ్రస్ను గల్లంతు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మట్టాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో నిబద్ధత గల నాయకులు కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. 35రోజుల పాటు తన కోసం కష్టపడి పనిచేస్తే 1825రోజులు మీ కోసం పని చేస్తానని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులకు డిపాజిట్ రాకుండా చేయాలని కోరారు.
మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, మహిళా అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, ఆనేగౌని అంజయ్యగౌడ్, కాకి దశరథ ముదిరాజ్, కృష్ణారాంభూపాల్రెడ్డి, చిర్ర సాయిలు, సామయ్య, మేఘనాథ్రెడ్డి, లచ్చానాయక్, సామ మహేందర్రెడ్డి, దామోదర్గౌడ్, రాజేందర్రెడ్డి, పున్న భిక్షపతి, దేవీలాల్ నాయక్, నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు ముద్ద పవన్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్రెడ్డి, తాళ్ల కార్తీక్, సొలిపేట అమరేందర్రెడ్డి, విఘ్నేశ్వర్రెడ్డి, శ్రీధర్ ముదిరాజ్, పాండుగౌడ్, బొక్క దీక్షిత్రెడ్డి, సామయ్య, సదానంద్గౌడ్, ఆనంద్, సామ ప్రకాశ్రెడ్డి, రామకృష్ణ, వెంకటేశ్, శ్రీకాంత్రెడ్డి, ప్రవీణ్నాయక్, అలీ, పారిజాతం, శ్రీహరి, ఎర్రబైరు పుల్లారెడ్డి, జయమ్మరాజు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.