సిటీబ్యూరో, జూలై 8(నమస్తే తెలంగాణ): సాఫ్ట్వేర్ అప్లికేషన్ల అభివృద్ధిలో సహకారాన్ని కోరేందుకు ‘స్వేచ్ఛ’ ఆధ్వర్యంలో ‘డెవలపర్స్ డేస్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. హైటెక్ సిటీలో టెక్ మహీంద్రా డానుబే ఆడిటోరియంలో నిర్వహించిన ఈ చర్చలో ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా జననల్ సెక్రెటరీ కిరణ్ చంద్ర మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లర్నింగ్ టెక్నాలజీలకు ఎంతో భవిష్యత్తు ఉందన్నారు. మెక్రోసాఫ్ట్ సంస్థ ఉద్యోగి జానకిరామ్ మాట్లాడుతూ లైనక్స్, ఫ్రీ సాఫ్ట్వేర్లు సమాజానికి ఉపయోగకరంగా మారాయన్నారు.
గూగుల్లో వెబ్ ఎంఎల్ టెక్నాలజీపై పనిచేస్తున్న జాసన్ మేయస్ మాట్లాడుతూ టెన్సర్ప్లో జేఎస్ సాఫ్ట్వేర్ టూల్తో వెబ్ బ్రౌజింగ్ ఆప్లికేషన్లో మెషీన్ లర్నింగ్(ఎంఎల్) టెక్నాలజీ మోడల్స్ను వినియోగించేందుకు అవకాశం ఉన్నదన్నారు. టెన్సర్ప్లో జెఎస్ సాప్ట్వేర్ టూల్ను ఉపయోగించి రూపొందించిన ఏఐ అప్లికేషన్ నమూనాలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రదర్శించి, వాటి పనితీరును వివరించారు. కార్యక్రమంలో స్వేచ్ఛ డెవలపర్ చాప్టర్ కన్వీనర్ రంజిత్ రాజ్ వాసం, ప్రధాన కార్యదర్శి గణేష్, టెక్ మహీంద్రా హైదరాబాద్ టెక్నికల్ కౌన్సిల్ హెడ్ ముఖేష్ శర్మతో పాటు ఐటీ రంగ నిపుణులు పాల్గొన్నారు.
కళ్యాణ్నగర్ పార్కు.. కనువిందు
కనువిందు చేస్తున్న వేలాడే.. ఉద్యానవనం వెంగళరావు నగర్ పరిధి కళ్యాణ్నగర్లో ఆవిష్కృతమైంది. వీక్షకుల మదిని దోస్తూ సరికొత్త హంగులతో జిగేల్మంటోంది. వెలు గు జిలుగులతో స్థానికులను రంజింపజేస్తూ అత్యంత సుందరమైన తన సోయగాన్ని చూపుతోంది. ప్రకృతిని సైతం పరవశింపజేసేలా అద్భుతమైన తీరన అందాలను పోగేసుకుం ది. గతంలో ఈ పార్కు స్థలం కబ్జా కోరల్లో చిక్కుకుంది. స్థానికుల సుదీర్ఘ పోరాటంలో ఎట్టకేలకు విజయం సాధించింది. ప్రభుత్వం ఈ పార్కుకు రూ.2 కోట్లను వెచ్చించి సుందరమైన బృందావనంలా మలచింది. నేడు ఈ పార్కు ను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆవిష్కరించనున్నారు.
– వెంగళరావునగర్, జూలై 8