మియాపూర్ : సుస్థిర పాలనతోనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ (Mla Gandhi) అన్నారు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలను అందించే బీఆర్ఎస్ పాలన కావాలో, అయ్యా అప్పా అంటూ ఢిల్లీ పెద్దలకు గులాం గిరి చేసే పరిపాలన కావాలో ప్రజలు తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్, పార్టీ శ్రేణులతో కలిసి గురువారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి తమ నేత, సీఎం కేసీఆర్ (CM KCR) ఒక్కరేనని అన్నారు. కాంగ్రెస్కు మాత్రం ఏడాదికోసారి మారే సీఎంలున్నారని, అయిదేండ్లలో అయిదుగురు పరిపాలించిన దాఖాలాలు ఉన్నాయని ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల్లో సుస్థిర, సమర్థమైన సీఎం కేసీఆర్ పాలనకే మరో మారు జై కొట్టాలని కోరారు.
రాష్ట్రాన్ని, నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి పరిచిన బీఆర్ఎస్కు మాత్రమే ఓటు అడిగే హక్కుందని, ప్రజలు సైతం కారుకే మరోసారి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో రూ. 9 వేల కోట్ల నిధులతో నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసానని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళా నేతలు పాల్గొన్నారు.