మేడ్చల్, మార్చి14(నమస్తే తెలంగాణ): వచ్చే పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావారణంలో నిర్వహించేందుకు అధికారులు బాధ్యతతో పనిచేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం సంబంధిత ఎన్నికల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో ఫ్లయింగ్ స్వాడ్ బృందాలు పర్యవేక్షణలో ఉంటాయన్నారు. సమస్యాత్మక ప్రదేశాల్లో ప్రత్యేకమైన ఫ్లయింగ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ. 50 వేలకు మించి నగదు రవాణా చేస్తే సీజ్ చేయాలన్నారు. రూ. 10 లక్షల వరకు ఆధారాలు లేకపోతే ఇన్కమ్ టాక్స్ వారికి సమాచారం అందించాలన్నారు.