శంషాబాద్ రూరల్/ మైలార్దేవ్పల్లి, డిసెంబర్ 26 : పేదల కుటుంబాలలో సీఎం రిలీఫ్ ఫండ్ వెలుగును నింపుతున్నదని ఎమ్మెల్యే టి. ప్రకాశ్గౌడ్ అన్నారు. సోమవారం మైలార్దేవ్పల్లి డివిజన్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ. 2.50లక్షల చెక్కును అనారోగ్యంతో నడువలేని స్థితిలో ఉన్న తోకల శ్రీరాంరెడ్డికి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి అందజేస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు టి. ప్రేమ్గౌడ్, సరికొండ వెంకటేశ్, గుమ్మడి కుమార్, రాఘవేందర్యాదవ్, రమేశ్ ముదిరాజ్, లక్ష్మీరాజ్, ఎన్ను శ్రీనివాస్రెడ్డి, సీహెచ్ రమేశ్ తదితరులు ఉన్నారు.
అయప్పస్వామి మహా పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే..
శంషాబాద్ పట్టణంలోని అయప్పస్వామి దేవాలయంలో అయప్పసేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మహా పడిపూజలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ఆయప్పస్వామి సేవా సమితి అధ్యక్షుడు ఆర్. గణేశ్గుప్త, మండల పార్టీ అధ్యక్షుడు కే చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్, కౌన్సిలర్ అజేయ్, యెట్టి కుమార్, మేకల వెంకటేశ్, నాయకులు మురళీగౌడ్, కొన్నమొల్ల శ్రీనివాస్లతో పాటు ఆయప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనారు.