సికింద్రాబాద్ : పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే సాయన్న అన్నారు. కార్కానాలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన 24 మందికి సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన సుమారు రూ.9.52లక్షల విలువైన చెక్కులను కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా లబ్ధి పొందాలని సూచించారు. చికిత్స చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ ఆసరాగా నిలుస్తున్నదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు నళినికిరణ్, పాండుయాదవ్, లోక్నాథ్, శ్యామ్కుమార్, ప్రభాకర్, నేతలు నివేదిత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, జీహెచ్ఎంసీ మాజీ కో ఆఫ్షన్ సభ్యులు నర్సింహముదిరాజ్, ముప్పిడి మధుకర్, నగేశ్, సరిత, తేజ్పాల్, భాస్కర్, సదానంద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.