సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీఐఐ ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. మెట్రో రైల్ రూట్ విస్తరణపై జరిగిన చర్చలో సీఎం మరోమారు స్పష్టతను ఇచ్చారు. గతంలో గచ్చిబౌలి – ఎయిర్ పోర్టు వరకు 31 కిలోమీటర్ల మేర ప్రణాళికలు రూపొందించారని, దానివల్ల సామాన్యజనాలకు పెద్దగా ఉపయోగం లేదన్నారు. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ చుట్టూ అధికంగా ధనికులు ఉండటం వల్ల వారు ఎకువగా సొంత వాహనాలు వాడుతున్నారని అన్నారు. గతంలో సర్వే చేసిన గౌలిగూడ – ఫలక్నుమా – ఎయిర్పోర్టు రూట్, ఎల్బీనగర్ నుంచి ఎయిర్ పోర్టు రూట్ను ప్రజలు ఎకువగా వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని తొలిదశలో 55 కిలోమీటర్ల మేర మెట్రో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఓఆర్ఆర్ లోపల మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఐకానిక్ డిజైన్లతో అమ్యూజ్ మెంట్ పారులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్, బిజినెస్ ఏరియాలు, షాపింగ్ మాల్స్ను అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. చారిత్రాత్మక కట్టడాలైన చార్మినార్, గొలొండ, సెవెన్ టూంబ్స్, తారామతి బారాదరి వంటి వాటిని అనుసంధానిస్తూ ఒక టూరిజం సర్యూట్ను రూపొందించాలని సూచించారు. ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) మోడల్లో పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో చెక్ డ్యాములను నిర్మించి వాటర్ ఫౌంటెన్స్, వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేస్తామని, ఫైవ్ స్టార్ హోటల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం సహకారమందిస్తుందని సీఐఐ ప్రతినిధుల సమావేశంలో సీఎం పేర్కొన్నారు.
సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా నాలుగు డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. ప్రస్తుతం నగరానికంతటికి జవహర్నగర్లో ఒకే డంప్ యార్డు ఉన్నదని, ప్రతిరోజు సుమారు 8 వేల టన్నుల చెత్త డంప్ యార్డుకు చేరుతుందని పేర్కొన్నారు. సిటీకి దూరంగా గతంలో శంషాబాద్, మెదక్ వైపు డంప్ యార్డు సైట్లను పరిశీలించామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిశీలించి ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. చెత్త ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని, ఇందుకు గాను టీఎస్ఎస్పీడీసీఎల్తో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. చెత్తను సాధ్యమైనంతవరకు రీసైకిల్ చేయాలని, ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.