మారేడ్పల్లి, ఏప్రిల్ 9: ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మోండా డివిజన్కు చెందిన సాయిరాం గణేశ్కు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ. 2 లక్షల చెక్కును శనివారం మారేడ్పల్లిలోని తన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, మాజీ కార్పొరేటర్ ఆకుల రూపతో కలిసి అందజేశారు. ఈ సందర్భం గా మంత్రి తలసాని మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్లో..
సికింద్రాబాద్: పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ తెలిపారు. పేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నియోజకవర్గానికి చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్వోసీలను క్యాంపు కార్యాలయంలో అందజేశారు. సుధీర్కు రూ.3 లక్షలు, సీతారామయ్యగౌడ్కు రూ. లక్ష ఎల్వోసీ పత్రాలను, అబ్దుల్ హమీద్కు రూ. 60 వేల చెక్కును అందజేశారు.