ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
నేరేడ్మెట్ , మార్చి 29 : సీఎం రిలీఫ్ ఫండ్ పేద కుటుం బాలకు వరం లాంటిదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. వినాయక్నగర్ డివిజన్, చంద్రగిరి కాలనీకి చెందిన పి. శిరీషకు వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ. 3 లక్షల ఎల్ఓసీ చెక్కును మంగళవారం ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ను పేదలు సద్వినియోగం చేసుకో వాలని సూచించారు. అలాగే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీఎన్వీ సతీశ్కుమార్, సంతోశ్, తదితరులు పాల్గొన్నారు.