చర్లపల్లి, జూన్ 7 : రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్యెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్, ఈసీనగర్ విజయ గణపతి ఆలయంలో నూతనంగా నిర్మించిన గోశాలను బుధవా రం ఆయన ప్రారంభించి.. గోమాత పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించడంతో పాటు ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.
అనంతరం ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్కుమార్, చెన్నయ్యలు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సందర్భంగా గోశాల నిర్మాణానికి సహకరించిన దాతలు విజయ్కుమార్, జ్నావి దంపతులను ఎమ్మెల్యే, ఆలయ కమిటీ ప్రతినిధు లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమి టీ ప్రతినిధులు శివయ్య, శ్యామ్కుమార్, రమణా రావు, నర్సింహారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రమేశ్, నర్సింహా రావు, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, కాసం మహిపాల్రెడ్డి, జాండ్ల ప్రభాకర్రెడ్డి, పద్మారెడ్డి, సారా అనిల్, గంప కృష్ణ, చంద్రమౌళి, సత్యనారాయణ, రెడ్డినాయక్, ఉపేందర్, నవనీతరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
శివాలయానికి భూమి పూజ ..
చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఇందిరా గృహకల్ప కాలనీలో శివాలయ నిర్మాణానికి కాలనీవాసులతో కలిసి ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ .. కాలనీలో నిర్మిస్తున్న శివాలయ ఆలయానికి తన వంతు సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు సాగర్గౌడ్, వెంకన్న, రాజుయాదవ్, ప్రవీణ్, సోమేశ్, చిన్న, రమేశ్, హరిబాబు, జయరాం, వెంకట్ గౌడ్, లక్ష్మణ్, నవనీతరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.