సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : నెక్లెస్ రోటరీ వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని శుక్రవారం సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా హుస్సేన్సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశాలున్నాయని నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు తెలిపారు. అలాగే నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, ఐమ్యాక్స్ రూట్లలోకి వచ్చే ట్రాఫిక్ను ఆయా కూడళ్లలో ఇతర మార్గాలకు మళ్లించడంతో పాటు ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కులు మూసి ఉంటాయని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 1నుంచి రాత్రి 8గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ట్యాంక్బండ్పై నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు.