రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం గిరిజనోత్సవాలు నింగినంటాయి. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ ఉత్సవాల్లో పాల్గొని గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు. ఆటపాటలు, సభలు, సహపంక్తి భోజనాలతో కార్యక్రమాలు పండుగ వాతావరణంలో జరిగాయి. మహేశ్వరంలోని పలు తండాల్లో జరిగిన వేడుకల్లో మంత్రి సబితారెడ్డి పాల్గొనగా, మేడ్చల్ జిల్లా సైదోనిగడ్డ తండాలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని గిరిజనులతో కలిసి ఆడిపాడారు. నగర వ్యాప్తంగా పలుచోట్ల ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి \\బడంగ్పేట, జూన్ 17 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహేశ్వరం మండలం తుమ్మలూరులోని అర్బన్ పార్కులో 19న నిర్వహిస్తున్న హరితోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొని మొక్కలను నాటనున్నారు. కాగా, 25 ఎకరాల విస్తీర్ణంలో 25వేల మొక్కలను సోమవారం రోజున నాటేందుకు అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 40 రకాల మొక్కలను ఇప్పటికే అందుబాటులో ఉంచామని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. అలాగే పార్కులో అవసరమైన అన్ని రకాల మొక్కలను పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు.
హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ తుమ్మలూరుకు రానున్నారు. ఈ మేరకు తుమ్మలూరు పార్కును శనివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ డాక్టర్ తీగల అనితా హరినాథ్రెడ్డి, కలెక్టర్ హరీశ్, అధికారులతో సందర్శించారు. పార్కులో నాటాల్సిన మొక్కల వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి హరితోత్సవం కార్యక్రమం విజయ వంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ జైశ్వాల్, ఆర్డీవో సూరజ్ కుమార్, ఫారెస్టు అధికారులు సైదులు, సుధాకర్ రెడ్డి, ఆనంద్ రావు, కందుకూరు జెడ్పీ టీసీ జంగారెడ్డి, తహసీల్దార్ మహమద్ అలీ, స్థానిక సర్పంచ్ మద్ది సురేఖ కర్ణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బడంగ్పేట, జూన్ 17 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహేశ్వరం మండలం తుమ్మలూరులో జరగనున్న హరితోత్సవం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. కాగా, తుక్కుగూడ మున్సిపాలిటీలో పారిశుధ్యం లోపించ కుండా..పచ్చదనం వెల్లివిరిసేలా కమిషనర్ వెంకట్ రామ్ దగ్గర ఉండి పనులు చేయిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లకు పాదులు తీసి నీళ్లు పోస్తూ పచ్చదనాన్ని కాపడుతున్నారు. ప్రధాన రహాదారిపై చెత్త చేదారం లేకుండా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో అన్ని ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి పనులపై పలు సూచనలు, సలహాలు అందిస్తున్నారు.
తుక్కుగూడ మున్సిపాలిటీలో విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నట్లు కమిషనర్ వెంకట్ రామ్ తెలిపారు. రూపాయలు 1.92కోట్ల పనులకు శంకుస్థాపనలు చేస్తారని కమిషనర్ తెలిపారు.