ఉప్పల్, అక్టోబర్ 3 : ఉప్పల్కు వంద పడకల ఆస్పత్రి ని మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రూ.37.50 కోట్ల నిధుల మంజూరుతో అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఉప్పల్లో సంబురాలు జరుపుకొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంపై వివిధ కాలనీల్లో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. వంద పడకల ఆస్పత్రి మంజూరుపై పలు ప్రాంతాలలో సంబురాలు చేసుకున్నారు.
ఉప్పల్ ప్రాంతానికి వంద పడకల ఆస్పత్రి కేటాయించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. ఆరు లక్షలకు పైగా జనాభా కలిగిన ఉప్పల్కు ఆస్పత్రి మంజూరు చేయడం హర్షణీయం. నగరానికి వచ్చే గ్రామీణ ప్రాంతాల ప్రజలతో పాటు ఉప్పల్ పరిసర ప్రాంతాల వాసులకు ఉప్పల్లో ఏర్పాటు చేసే వంద పడకల ఆస్పత్రి ఎంతో ఉపయోగపడుతుంది. గతంలో వంద పడకల ఆస్పత్రి కోసం అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు సీఎం కేసీఆర్కు ప్రత్యేకంగా వినతి పత్రం అందజేశాను. వంద పడకల ఆస్పత్రి అవసరాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లాను. ఆస్పత్రి ని మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. ఉప్పల్ పరిసర ప్రాంతాల ప్రజల కోసం వంద పడకల ఆస్పత్రి ని మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నాం.
ఉప్పల్కు వంద పడకల ఆస్పత్రి మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు. ఉప్పల్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఉప్పల్ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాను. ఉప్పల్లోని సమస్యలను గుర్తించాను. దశలవారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తాం. ప్రభుత్వ సహకారంతో ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తా. మీ కోసం నిరంతరం పనిచేయడానికి మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వదించండి.
– బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి