బాధలు బాపిన భగీరథుడి కోసం మునుగోడు నియోజకవర్గం పోటెత్తింది. సీఎం కేసీఆర్ను
చూడాలని, ఏం చెప్తారో వినాలని బంగారిగడ్డకు బారులు కట్టింది. ఊళ్లకు ఊళ్లు.. కుటుంబాలకు
కుటుంబాలు పాదయాత్రగా కదలిరావడం కనిపించింది. ఇసుకేస్తే రాలనంత జనంతో బహిరంగ సభ గులాబీ వనాన్ని తలపించింది. కామ్రేడ్లు తోడవడంతో కదనోత్సాహం నెలకొన్నది. నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డలో ఆదివారం నిర్వహించిన సీఎం కేసీఆర్ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
మునుగోడు బాధ్యత నాది. మునుగోడు నియోజక వర్గంలోని ప్రతి ఎకరాకూ నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. ఎక్కడి వరకైనా కొట్లాడి, తలపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తాను. మీ కోరికలైన వంద పడకల ఆసుపత్రి, చండూరు రెవెన్యూ డివిజన్ త్వరలోనే సాకారమవుతాయి.
– సీఎం కేసీఆర్
మునుగోడును గుండెల్లో పెట్టుకుంటాను తెలంగాణలాగే దేశాన్ని తయారు చేయాలని పుట్టుకొస్తున్నదే బీఆర్ఎస్ పార్టీ. చరిత్రలో సువర్ణావకాశం మునుగోడు ప్రజలకు దక్కింది. బీఆర్ఎస్కు గట్టి పునాది రాయి పెట్టండి. మునుగోడు విజయంతోనే దేశం బాగుపడుతది. మునుగోడును గుండెల్లో పెట్టుకుంటాను.
– సీఎం కేసీఆర్
ఆలోచించి ఓటు వేయాలె..
మౌనంగా ఉంటే.. ఆ మౌనమే శాపమైతది. ప్రేక్షకుల్లా చూసి మనది కాదు అనుకునే సందర్భం కాదిది. దయచేసి మునుగోడులో విద్యాధికులు, కవులు, కళాకారులు, రచయితలు, అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు చర్చ చేయాలి. ఓటు వేసేప్పుడు దేనికో ఆశపడి, ఎవడో చెప్పిండని మాయమాటకు లొంగి ఓట్లు వేస్తే మంచి జరుగదు. ముళ్ల చెట్లు పెడితే పండ్లు రావు. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి. దేశాన్ని ప్రైవేటీకరణ చేద్దామనుకునే వాళ్లకు ఈ ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.
సభకు ఎడ్లబండిపై వస్తున్న రైతులు
బంగారిగడ్డ బాటలో.. సీఎం కేసీఆర్ సభకు తరలివస్తున్న జనం
తల్లికి వందనం
తెలంగాణ తల్లికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి
వామపక్ష నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ అభివాదం