ఈ జిల్లాల్లో ఇద్దరు.. ముగ్గురు మోపయ్యారు. ఒకడైతే పకాత్ పేకాట క్లబ్బులు పెట్టి పైసలు మందినెత్తికొట్టి సంపాదిస్తడు. ఆడబ్బులు తెచ్చి సీసాలు, అదీఇది పంచి గోల్మాల్ చేస్తున్నరు. గోల్మాల్ గోవిందం గాళ్లను ప్రజలు గోల్మాల్ చేయనంత వరకు ఇదే దరిద్రం ఉంటది. ఈ దరిద్రాన్ని వదిలించుకోవాలి. ఆ శక్తి మీ చేతుల్లోనే ఉంటది. వాడు వచ్చి అడిగితే మొహమాటానికి ఆ అనాలే. సురుకుపెట్టే కాడ సురుకు పెట్టాలి.
గత వందేండ్లలో ఈ పదేండ్లే తెలంగాణ ప్రశాంతంగా ఉంది.. ఏ లొల్లి లేకుండా.. అందరం కలిసిమెలిసి ప్రశాంతంగా బతుకుతున్నాం. కాంగ్రెస్ హయాంలో తెల్లారితే లొల్లి ఉండేది. అందుకే చెప్తున్నా.. రాయి ఏదో.. రత్నం ఏదో గుర్తు పట్టాలి..” అని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి నియోజకవర్గం అభ్యర్థి మనోహర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. మన కంటే ముందు ఉన్నవాళ్లు ఏనాడైనా పేదల సంక్షేమం గురించి ఆలోచించారా? వాళ్ల మైండుకన్నా తట్టిందా..? పేదలకు కంటి చూపు ఇవ్వాలనే ఆలోచన వచ్చిందా.?
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా పేదలను ఆదుకుంటున్నదో అదరికీ తెలుసు. రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి విద్యా వ్యవస్థను బలోపేతం చేశాం. చేనేత కార్మికుల కోసం బతుకమ్మ చీరలను తీసుకువచ్చాం. బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు, అమ్మ ఒడి వాహనాలు, కేసీఆర్ కిట్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టున్నది. ఇవన్నీ సామాజిక బాధ్యతతో నిరుపేదల కోసం తెచ్చాం. పెద్దపల్లి జిల్లా తెచ్చిన మనోహర్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలి. కాంగ్రెస్కు ఓటేస్తే ఏమైతదనేది మీ ఊర్లళ్ల తెల్వనోళ్లకు మీరే అర్థమైతట్లు చెప్పాలె. ప్రజల మేలు కోరే పార్టీకే ఓటెయ్యాలి. అప్పుడే మీ బతుకులు బాగుంటయ్.. రాష్ట్రం ఇంకింత బాగుపడుతది.