ప్రభుత్వం తరఫున రంజాన్ కానుకలను
అందజేసిన టీఆర్ఎస్, ఎంఐఎం నాయకులు
అబిడ్స్, ఏప్రిల్ 24 : రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తూ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు దక్కిందని టీఆర్ఎస్ నాయకుడు ఎం.ఆనంద్కుమార్ గౌడ్ అన్నారు. జాంబాగ్ డివిజన్ పరిధిలోని సుభాన్పురాలో రంజాన్ పండుగను పురస్కరించుకుని కానుకలను టీఆర్ఎస్ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ప్రియాగుప్తా, శ్రీనివాస్ గౌడ్, నందుకుమార్, విజయ్కుమార్, నరేశ్గౌడ్ పాల్గొన్నారు.
మెహిదీపట్నం, ఏప్రిల్ 24 : తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని నాంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి సీహెచ్.ఆనంద్కుమార్గౌడ్ అన్నారు. ఆదివారం మెహిదీపట్నం హుమాయూన్నగర్లో టీఆర్ఎస్ నాయకులు ముస్లింలకు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీహెచ్.ఆనంద్కుమార్గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సంజయ్, యూసుఫ్, ఇక్బాల్ పాల్గొన్నారు.
మెహిదీపట్నంలో.. అయోధ్యనగర్, దిల్షాద్నగర్ ప్రాంతాల్లో ఎంఐఎం నాయకులు సమీఉల్లా చాంద్ రంజాన్ కానుకలను లబ్దిదారులకు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్, నగర మాజీ మేయర్, మెహిదీపట్నం కార్పొరేటర్ మాజీద్ హుస్సేన్ ఆదేశాలతో లబ్ధిదారులకు రంజాన్ కానుకలను అందచేస్తున్నామన్నారు.
జియాగూడ, ఏప్రిల్ 24 : అన్ని మతాల పండుగలకు సీఏం కేసీఆర్ ప్రాధాన్యత కల్పిస్తున్నారని జియాగూడ మాజీ కార్పొరేటర్ మిత్రకృష్ణ అన్నారు. అదివారం జియాగూడ టీఆర్ఎస్ కార్యాలయంలో ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రంజాన్ కానుకలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ నాయకులు అభిషేక్ మిత్ర, ఉమేశ్, నర్సింగ్ పాల్గొన్నారు.