శామీర్పేట, మార్చి 31 : రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సర్పంచ్ జామ్ రవి అన్నారు. మూడుచింతలపల్లి మండల కేంద్రంలో గురువారం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ హక్కులకు ఎలాంటి భంగం కలిగినా చట్టపరమైన చర్యలు చేపట్టి హక్కుల సాధనకు కృషి చేయాలన్నారు. అనంతరం గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమంలో తాసీల్దార్ రాజేశ్వర్రెడ్డి, ఎస్ఐ మునీందర్, మధుసూదన్రెడ్డి,ఉపసర్పంచ్ వెంకటరమణారెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
రాజబొల్లారంలో..
మేడ్చల్ రూరల్, మార్చి 31 : మండల పరిధిలోని రాజబొల్లారంలో గురువారం తాసీల్దార్ గీత ఆధ్వర్యంలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి పాల్గొని మాట్లాడారు. పౌరులందరికీ రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిందన్నారు. ఒకరు ఇంకొకరిపై వివక్ష చూపితే చట్టారీత్యా నేరం అవుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శైలజావిజయానందారెడ్డి, ఎంపీడీవో రమాదేవి, ఎస్సై అప్పారావు పాల్గొన్నారు.