ఒకేసారి 10 వేల మందికి శిక్షణ
రూ.30 లక్షలు కేటాయింపు
ఈనెల 25 నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం
సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ సర్వీసెస్ అకాడమీ (కేంద్రం) అందుబాటులోకి వచ్చింది. 25 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతున్నాయి. దాదాపు 10 వేల మంది యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఈ కేంద్రం అందుబాటులోకి వస్తున్నది. అన్ని రకాల పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను అందుబాటులో ఉంచుతూ, సబ్జెక్టుల వారీగా నిపుణులను నియమిస్తున్నారు.
ఈనెల 25 నుంచి సివిల్ సర్వీసెస్ అకాడమీలో నిరుద్యోగులకు క్లాసులు ప్రారంభమవుతాయని ఓయూ వీసీ రవీందర్ తెలిపారు. దాదాపు రూ.30 లక్షల ఖర్చుతో ఈ కేంద్రం అందుబాటులోకి రానున్నట్లు ఓయూ వర్గాలు తెలిపాయి.