మన్సూరాబాద్, సెప్టెంబర్ 2 : భర్త, పిల్లలతో కలిసి అమెరికాలో నివాసముంటున్న హయత్నగర్, భాగ్యలతకాలనీకి చెందిన ఓ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి మామ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా, నార్కట్పల్లి మండలం, అమ్మనబోలు గ్రామానికి చెందిన ఏనుగు మల్లారెడ్డి, అనసూర్య దంపతుల కుమారుడు ఏనుగు శ్రీనివాస్రెడ్డితో నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, వెలిమినేడు గ్రామానికి చెందిన నర్సిరెడ్డి, చంద్రకళ దంపతుల కుమార్తె కవిత (40) వివాహం 18 సంవత్సరాల కిందట జరిగింది. ఏనుగు మల్లారెడ్డి, అనసూర్య దంపతులు ప్రస్తుతం ఎల్బీనగర్, మన్సూరాబాద్ డివిజన్ సూర్యోదయనగర్ కాలనీలో నివాసముంటున్నారు.
నర్సిరెడ్డి, చంద్రకళ దంపతులు ప్రస్తుతం హయత్నగర్ డివిజన్ భాగ్యలతకాలనీలో నివాసముంటున్నారు. శ్రీనివాస్రెడ్డి, కవిత దంపతులు వారి ఇద్దరు కుమారులతో కలిసి ప్రస్తుతం అమెరికాలోని మిస్సోరి స్టేట్, సైంట్టాస్ సిటీలో నివాసముంటున్నారు. శ్రీనివాస్రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తుండగా.. కవిత ఇంటి పట్టునే ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా కవిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకుంటుంది. అయినప్పటికీ ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో ఆమె మనోవేదనకు గురై బుధవారం రాత్రి అమెరికాలోని తమ నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె మామ ఏనుగు మల్లారెడ్డి తెలిపారు. కవిత మృతదేహాన్ని నగరానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.