సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సెంట్రల్ గ్రీవెన్స్గా ఉపయోగిస్తున్న కంట్రోల్ రూమ్ (హెల్ప్ లైన్ ) ద్వారా వచ్చిన వ్యక్తిగత, సామాజిక సమస్యలపై వచ్చిన విన్నపాలను సత్వర పరిషారం చేయడం ద్వారా ప్రజలు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అధికారులు గురువారం తెలిపారు. పౌరుల నుంచి హెల్ప్ లైన్ నంబర్కు గానీ, ట్విట్టర్ గానీ, మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా గానీ, డయల్ 100 ద్వారా గానీ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చిన విన్నపాలను పరిషరించడమే ధ్యేయంగా రౌండ్ ది క్లాక్ 24 గంటలపాటు పని చేస్తుందని పేర్కొన్నారు. వివిధ సమస్యలపై వచ్చిన విన్నపాలను సత్వర పరిషారం చేయడంతో పౌరులు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అధికారులు స్పష్టం చేశారు.
గతేడాది ఈ నేపథ్యంలో 2022 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు 2,41,752 ఫీడ్ బ్యాక్ కాల్స్ చేశారు. అందులో 1,55,259 అర్జీదారులకు ఫోన్ కనెక్ట్ అయ్యింది. అందులో 1,18,662 మంది సంతృప్తి వ్యక్తం చేశారు. 36,597 మంది విన్నపదారులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. 86,493 మంది వారి ఫోన్కు స్పందించలేదు. ఈ విధంగా జనవరి మాసంలో 67 శాతం అర్జీదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అదే విధంగా ఫిబ్రవరి 71 శాతం, మార్చిలో 68 శాతం, ఏప్రిల్ 75 శాతం, మే మాసంలో 69 శాతం, జూన్లో 74 శాతం, జూలైలో 72 శాతం, ఆగస్టులో 71 శాతం, సెప్టెంబర్లో 76 శాతం, అక్టోబర్లో 81 శాతం, నవంబర్లో 84 శాతం డిసెంబర్ లో 86 శాతం విన్నవించిన వారు సంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు.