లక్ష్మీనర్సింహస్వామికి పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రులు మల్లారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి
పూర్ణకుంభంతో మంత్రులు, ఎమ్మెల్యేలకు స్వాగతం
కీసర, ఏప్రిల్ 26 : చీర్యాల్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో 14వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం రెండోరోజు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి విచ్చేశారు. ఆలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణగౌడ్, ఎంపీపీ ఇందిర, ఆలయ ధర్మకర్త శ్రీహరిగౌడ్, వేదపండితులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. స్వామివారికి మంత్రులు ,ఎమ్మెల్యేలు పట్టు వస్ర్తాలను అందజేశారు.
అనంతరం గర్భాలయంలో ఉన్న స్వామికి యాదాద్రి ఆలయ వేదపండితులు నర్సింహమూర్తి స్వర్ణపుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ అనతికాలంలో వైష్ణవ ఆలయం అభివృద్ధి చెందిందని తెలిపారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయడం సంతోషంగా ఉందని, ఇక్కడ యాదాద్రి దేవాలయానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తుల మన్ననలు పొందడం గర్వంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ కూడా 2015లో ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ పరంగా ఆలయానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలకు సన్మానం..
మంత్రులు మల్లారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యేలు బేతి సుభాష్రెడ్డి, దానం నాగేందర్, జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డిలను ఆలయ చైర్మన్ లక్ష్మీనారాయణగౌడ్ సత్కరించారు. అనంతరం స్వామివారి చిత్రపటాలను అందజేసి వేదపండితులతో ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ, ఏనుగు సుదర్శన్రెడ్డి, నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్ ప్రణీతగౌడ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జె.సుధాకర్రెడ్డి, మున్సిపాలిటీల చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, పలు పార్టీలకు చెందిన నేతలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.