రవీంద్రభారతి : తల్లిదండ్రులు పిల్లలను లింగ వివక్ష లేకుండా పెంచాలని అప్పుడే వారు ఉన్నత స్థాయికి వెళ్తారని స్త్రీ, శిశుసంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister Sitakka) అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(Womens Day) సందర్భంగా రవీంద్రభారతిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్స్ అచీవర్స్ అవార్డ్సు 2024 ను గురువారం ఘనంగా నిర్వహించారు.
సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు పౌష్టికాహారం లోపం వల్ల రక్తహీనతతో బాధపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అంగన్వాడీ లలో పిల్లలకు నర్సరీ క్లాస్లను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. నగరంలో ఉండే వలస కూలీలు ఉండే ప్రాంతాల్లో అంగన్వాడీ మొబైల్ క్యాంటీన్లను ఏర్పాటు చేసి, వారి పిల్లలకు పౌష్టికాహారం(Malnutrition) అందిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు సానిటరీ న్యాప్కిన్ కిట్స్లను అందిస్తామన్నారు. వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలను ఈ సందర్భంగా సన్మానించారు.