గోల్నాక, జూలై 20 : బుడిబుడి అడుగులు వేసే వయస్సు..కుర్చీ ఎక్కబోతూ ఓ చిన్నారి రెండో అంతస్థు బాల్కనీ నుంచి జారి మృతిచెందాడు. అంబర్పేట ఆకాశ్నగర్లో ఉంటున్న సయ్యద్ రబ్బాని పాషా పెయింటర్. ఇతడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ముగ్గురు పిల్లలు, రెండోభార్యకు ఒక కుమారుడు ఉన్నాడు. ఈనెల 19న ఉదయం 8 గంటల సమయంలో మొదటి భార్య మూడో కుమారుడు సయ్యద్ అలీ(4) నిద్రమత్తులో కుర్చీ ఎక్కుతుండగా బాల్కనీ నుంచి జారి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.