ఐసోలేషన్ లో క్షేమంగా ఎంపీ
కరోనా ఇంకా పూర్తిగా పోలేదు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగిపోతున్నాయి. తాజాగా చేవెళ్ల లోక్ సభ సభ్యుడు జి రంజిత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.
ఆయనకు శనివారం సాయంత్రం పరీక్ష చేయగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో రంజిత్ రెడ్డి వెంటనే ఐసోలేషన్ లోకి వెళ్ళారు. వైద్యులను సంప్రదించి, తగు మందులు తీసుకుంటూ, జాగ్రత్త వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో తనతో సన్నిహితంగా మెలిగినవారు, తనతో కాంటాక్టులో ఉన్న వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని పరీక్షల్లో పాజిటివ్ తేలితే చికిత్స చేయించుకోవాలని ఆయన సూచించారు.
చేవెళ్ల నియోజకవర్గంలో ప్రజలకు తన సిబ్బంది అందుబాటులో ఉంటారని, ప్రజలు సహకరించాలని ఎంపీ రంజిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.