సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని 15 నియోజక వర్గాలకు చెందిన పేద ముస్లింలకు ఆర్థిక సహాయం కింద రూ.35.08 కోట్ల చెక్కులను శనివారం పంపిణీ చేశారు. ముస్లిం జనాభా ప్రాతిపదికన జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,508 ముస్లింలకు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోంమంత్రి మహమూద్ అలీ నగరంలోని ఎల్బీ స్టేడియంలో చెక్కులను పంపిణీ చేశారు. పేద ముస్లింలను అన్ని విధాలుగా ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.