బంజారాహిల్స్,మే 23 : పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం ఇస్తామంటూ నమ్మించి రూ.1.2కోట్లను తీసుకుని మోసం చేసిన నిర్మాణ సంస్థపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు(Cheating case) నమోదయింది. వివరాల్లోకి వెళ్తే.. కూకట్పల్లి సమీపంలోని హైదర్నగర్కు చెందిన వడ్దాలపు సునీత, దాసరి వనమాలకు రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెం10లోని జీఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్(GSR Infra Group Private Limited) మార్కెటింగ్ డౌరెక్టర్ శిల్వ ద్వారా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్రావు, అతడి భార్య జి.పద్మజ పరిచయం అయ్యారు.
నారాయణపేట సమపంలోని ఫార్మ్ ల్యాండ్స్ వెంచర్లో పెట్టుబడి పెడితే రెండేళ్లలో రెట్టింపు లాభం ఇస్తామని వారు నమ్మబలికారు. దీంతో వారిద్దరూ కలిసి రూ.1.20 కోట్లను పెట్టుబడిగా పెట్టారు. ఈ పెట్టుబడికి గ్యారెంటీగా ఆరు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారు. అయితే రెండేళ్ల గడువు పూర్తయినా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పాటు కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.
దీంతో వారి గురించి వాకబు చేయడం కోసం ఇటీవల జూబ్లీహిల్స్లోని హెడ్ఆఫీస్కు వెళ్లి చూడగా శ్రీనివాస్రావు, పద్మజ, శిల్ప పరారీలో ఉన్నారని తేలింది. దీంతో తమను నమ్మించి మోసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాదితురాలు సునీత కొడుకు పవన్కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐపీసీ 420,406 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.