హైదరాబాద్ : హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా అవసరమైన చోట ప్రభుత్వం ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు ఉండొద్దనే ఉద్దేశంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో అండర్ పాస్లు, ఫ్లై ఓవర్లు, లింక్ రోడ్లను ప్రభుత్వం నిర్మించింది. దీంతో అటు ప్రజలు, ఇటు వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తమ గమ్యస్థానాలకు త్వరితగతిన చేరుకుంటున్నారు.
ఇక వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(SRDP) కింద నిర్మించిన చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ను మంగళవారం ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 674 మీటర్ల పొడవున్న ఈ ఫ్లై ఓవర్ను రూ. 45.90 కోట్ల వ్యయంతో నిర్మించారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమం కింద హైదరాబాద్ నగరంలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
Will be throwing open the 674 metre long flyover built at a cost of ₹45.90 Cr at Chandrayanagutta tomorrow
Strategic Road Development Program (SRDP) has been key to adding more infrastructure Hyderabad pic.twitter.com/doSortjosr
— KTR (@KTRTRS) August 22, 2022