Gutha Sukender Reddy | ఖైరతాబాద్, ఫిబ్రవరి 17 : ప్రస్తుత రాజకీయాలు చూస్తే చెన్నమనేని ఆత్మ ఘోషిస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. చెన్నమనేని జీవిత భావితరాలకు ఆదర్శనీయం’ అని వక్తలు అన్నారు. నెక్లెస్రోడ్లోని నెక్లెస్రోడ్లోని జలవిహార్లో చెన్నమనేని రాజేశ్వర్ రావు, లలితాదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి దివంగత చెన్నమనేని రాజేశ్వర్ శతజయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టల్ కవర్, ‘చట్టసభల్లో మూడు దశాబ్దాల ప్రజావాణి చెన్నమనేని’ అనే పుస్తకాన్ని ముఖ్య అతిథులుగా హాజరైన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,
రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మజీ మంత్రులు కొప్పుల ఈవ్వర్, కుందూరు జానా రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ పీవీఎస్ రెడ్డి, ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చెన్నమనేని రమేశ్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సభ మర్యాదలు మరిచి మాట్లాడే వారినే గౌరవించే పరిస్థితి నెలకొందని తెలిపారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. చెన్నమనేని జీవిత విశేషాలతో రూపొందించిన ఫొటో ప్రదర్శన ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో చెన్నమనేని రాజశ్వేర్ రావు కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.