హైదరాబాద్ : హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. 2 గంటల వ్యవధిలోనే ఆరు చోట్ల బంగారు గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. మార్నింగ్ వాకర్స్ను టార్గెట్ చేసుకున్న ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్పై తిరుగుతూ చోరీలకు పాల్పడ్డారు. ఇద్దరు దుండగులు కూడా మాస్కు ధరించి ఉన్నారు. ఉప్పల్లో మొదలుపెట్టి రాంగోపాల్పేటలో ముగించారు. చైన్ స్నాచింగ్కు పాల్పడిన దృశ్యాలు ఆయా ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చోరీలకు పాల్పడిన అనంతరం పల్సర్ బైక్ను రాంగోపాల్ పేటలో వదిలేసి పోయారు దుండగులు. బాధిత వ్యక్తుల ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. చైన్ స్నాచర్స్ కోసం 10 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. టీఎస్ 12 ఈ 7408 బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఉదయం 6:20కి ఉప్పల్లో
ఉదయం 6:40కి ఉప్పల్లోనే మరోచోట
ఉదయం 7:10కి నాచారంలో
ఉదయం 7:40కి ఉస్మానియా యూనివర్సిటీలో
ఉదయం 8 గంటలకు చిలకలగూడలో
ఉదయం 8:10కి రాంగోపాల్పేటలో