శేరిలింగంపల్లి, జూన్ 4 : సీఎం సహాయ నిధికి సెక్టార్ థెరపీయూటిక్ ఇండియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రమేశ్ పంచాంగుల తరపున రూ.15 లక్షల చెక్కను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ శుక్రవారం రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు అందజేశారు. గచ్చిబౌలిలోని టిమ్స్లో 150 పడకల ఐసీయూ కేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రికి ఈ సందర్భంగా అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మం జుల రఘునాథ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, టీఆర్ఎస్ నాయకులు పల్లపు సురేందర్ పాల్గొన్నారు.