మహేశ్వరం జోన్ బృందం, మే 1 : కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి తెలిపారు. మే డే సందర్భంగా కందుకూరు మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్యర్యంలో జెండాను ఎగుర వేశారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, కార్మిక విభాగం అధ్యక్షుడు నవీన్ కుమార్, సీనియర్ నాయకులు సురుసాని సురేందర్రెడ్డి, గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, డైరెక్టర్ సామ ప్రకాశ్రెడ్డి, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ల కార్తిక్, అందుగుల సత్యనారాయణ పాల్గొన్నారు.
ఘనంగా ‘మే డే’ ఉత్సవాలు
చాదర్ఘాట్, మే 1: మే డే ను పురస్కరించుకుని ఏక్తా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించారు. ఆదివారం ఏక్తా వెల్ఫేర్ అసోసియషన్ అధ్యక్షుడు రాజేశ్ యాదవ్ పారిశుధ్య కార్మికులతో కలిసి ఉత్సవాలను నిర్వహించారు.