బడంగ్పేట/మహేశ్వరం/కందుకూరు/ఆర్కేపురం/పహాడీషరీఫ్, మే 1 : ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గంలో మేడే వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఆయా యూనియన్ల ఆధ్వర్యంలో కార్మికులు జెండాలను ఎగురవేసి కార్మికుల ఐక్యతను చాటుకున్నారు. కార్మికుల హక్కుల సాధనకు ఐక్యంగా ఉంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.