కాచిగూడ,ఆగస్టు 31 : కాచిగూడ రైల్వేస్టేషన్లో చార్జింగ్ పెట్టిన సెల్ఫోన్ మాయమైన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళూర్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ అజీజ్ కుమారుడు ముస్తాఫా అబ్దుల్ అజీజ్(23)విద్యార్థి. మంగళూర్కు వెళ్లడానికి సోమవారం రాత్రి కాచిగూడ రైల్వేస్టేషన్కు వచ్చాడు.
రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం-1లో తన ఖరీదైన సెల్ఫోన్ను చార్జింగ్ పెట్టాడు.
ఇదే అదునుగా భావించిన దొంగలు అజీజ్ చార్జింగ్ పెట్టిన సెల్ఫోన్ను దొంగిలించారు. అబ్దుల్ అజీజ్ కాచిగూడ రైల్వే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ శ్రీరాంరెడ్డి తెలిపారు.