హైదరాబాద్ : ప్రాంక్ వీడియో చిత్రీకరణ ఓ యూట్యూబర్ ప్రాణాల మీదకు తెచ్చింది. వీడియో చిత్రీకరణ వివాదానికి దారితీయడంతో దుకాణం యజమాని యూట్యూబర్ను చావబాదాడు. నగరంలోని జగదీశ్ మార్కెట్లో ఇవాళ సాయంత్రం ఈ ఘటన జరిగింది. నగరానికి చెందిన ఓ యూట్యూబర్ ప్రాంక్ వీడియో చిత్రీకరణ కోసం జగదీశ్ మార్కెట్కు వచ్చి ఓ దుకాణం యజమానితో గొడవకు దిగాడు. దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన దుకాణం యజమాని సదరు యూట్యూబర్ను చితకబాదాడు. ప్రాంక్ వీడియో అని చెబుతున్నా వినకుండా దాడి చేశాడు. సమాచారం అందుకున్న అబిడ్స్ పోలీసులు అక్కడి చేరుకొని ఇద్దరిని పోలీసు స్టేషన్కు తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.