సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ వింగ్ రూ.13.31 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు. రూ.కోటి 87 లక్షల విలువజేసే ఇతర వస్తువులు, మద్యం పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. 150 కేసులు నమోదు చేశామన్నారు. తాజాగా.. గడిచిన 24 గంటల వ్యవధిలో వివిధ బృందాల చేపట్టిన తనిఖీల్లో రూ.34 లక్షల నగదు, రూ.56,728 విలువజేసే ఇతర వస్తువులు, 50 లీటర్ల అక్రమ మద్యం పట్టుకొని, సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు.