హైదరాబాద్ : ఓ కారు ఉన్నట్టుండి ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బి.యన్.రెడ్డి నగర్ సాగర్ కాంప్లెక్స్ దగ్గర నాగార్జున సాగర్ రహదారిపై చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అతి వేగంగా వెళ్తున్న ఓ కారు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో కారు వెనకాల ఉన్న బస్సులు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. ఈ సంఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్ లో హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.