హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ‘వరల్డ్ హెల్త్ డే’ పురస్కరించుకుని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ ప్రాంగణంలో వైద్యులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డా.మంజుల, డా.పవన్ కుమార్ రెడ్డి, డా.సంగీత మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ గొప్ప కార్యక్రమం అని కొనియాడారు. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.
చెట్లను మనం కాపాడితే అవి తిరిగి మనల్ని కాపాడుతాయని పేర్కొన్నారు. మనకు ఆక్సిజన్ ఎంతో అవసరం అన్నారు. ఆక్సిజన్ కావాలంటే ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. అనంతరం కేర్ హైటెక్ సిటీ, కేర్ నాంపల్లి, కేర్ ముషీరాబాద్ వైద్య సిబ్బందికి చాలెంజ్ విసిరారు. కార్యక్రమంలో కేర్ హాస్పిటల్ వైద్యులు డా.రతన్ జా, డా.రాహుల్ అగర్వాల్, డా.అబ్దుల్, డా.వేణుగోపాల్, ఎస్.కె బేహారా, డా.స్నేహ హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.