శామీర్పేట, ఏప్రిల్ 20: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగు చూసింది. సీఐ సుధీర్కుమార్, ఎస్ఐ రవికుమార్ కథనం ప్రకారం..మహారాష్ట్ర చంద్రాపూర్కు చెందిన హరీశ్పరోధి, పలాశ్ సంజయ్ సాల్వేలు శామీర్పేట నల్సార్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తీరుగుతున్నారు. అదే సమయంలో గస్తీ కాస్తున్న ఎస్ఐ రవికుమార్ సిబ్బందితో కలిసి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద వెతికి చూడగా బ్యాగ్లో 2.8 కేజీల గంజాయి లభించింది. అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కు తరలించి విచారించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న వీరికి జీతం అవసరాలకు సరిపోవడం లేదని అధిక సంపాదన లక్ష్యంగా చంద్రాపూర్లో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద మొదట్లో కొంచెం కొంచెం గంజాయిని కొనుగోలు చేసి మాదాపూర్, శామీర్పేట చుట్టుపక్కల అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలో చంద్రాపూర్లో కొనుగోలు చేసిన 2.8 కేజీల గంజాయిని శామీర్పేట ఏరియాలో అమ్మడం కోసం బుధవారం వచ్చి గస్తీ కాస్తున్న పోలీసులకు చిక్కిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నింధితులతో పాటు 2.8 కేజీల గంజాయి, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.