మాదాపూర్, సెప్టెంబర్ 28: పాన్షాపుల్లో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ శాఖ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన గురువారం శేరిలింగంపల్లి ఎక్సైజ్ శాఖ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శేరిలింగంపల్లి ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ గౌడ్ కథనం ప్రకారం … ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రశాంత్ కుమార్ పరిదా (30), బిజయ్ కుమార్ గిరి (30) బతుకు దెరువు నిమిత్తం మాదాపూర్లోని చందానాయక్ తండాకు వలస వచ్చి ఇద్దరు కలిసి పాన్ షాపు నిర్వహిస్తున్నారు.
ఈ నెల 28న మధ్యాహ్నం సమయంలో పాన్ షాపులో గంజాయి చాక్లెట్స్ను విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. పాన్ షాపులో 7 కేజీలకు సంబంధించిన 40 గంజాయి మిక్స్డ్ చాక్లెట్లు ఉన్న 39 పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.