సిటీబ్యూరో, జూన్ 14(నమస్తే తెలంగాణ): రక నిల్వలు పెంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ అన్నారు. ‘బ్లడ్ డోనర్స్ డే’ సందర్భంగా సీపీ సజ్జనార్ గచ్చిబౌలి పోలీసు కమిషనర్ కార్యాలయంలో ‘కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్(CALLFORBLOODFOUNDATION) యాప్’ను ప్రారంభించారు. ఈ యాప్ను రూపొందించిన ప్రతినిధులు చింతల సంపత్, భవాని శంకర్లను సజ్జనార్ సత్కరించారు. అర్హతలున్న ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా సీపీ పిలుపునిచ్చారు. ఎలాంటి అపోహలకు గురికావొద్దని, వ్యాక్సిన్ వేసుకున్న 14 రోజుల తర్వాత ఎవరైనా రక్తదానం చేయొచ్చని తెలిపారు. రక్తదానం చేయాలనుకున్న వారు ఈ యాప్లో నమోదు చేసుకోవాలన్నారు. రక్త నిధిలో నిల్వలను పెంచేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. సైబరాబాద్ పోలీసు ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్లను నిర్వహించి దాదాపు 12 వేల మంది రక్తదానం చేసేలా చైతన్యం కల్పించామని సీపీ చెప్పారు.