కీసర (హైదరాబాద్) : హైదరాబాద్ శివారులో ఉన్న కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి ( Bhavani Ramalingeshwara Swamy) ఆలయంలో బుధవారం హుండీ(Hundi) ని లెక్కించారు. కార్తిక మాసం సందర్భంగా నెల రోజులపాటు కీసరగుట్టలో నిర్వహించిన ఉత్సవాల సందర్భంగా స్థానిక భక్తులతో పాటు ఇతర గ్రామాలకు చెందిన భక్తులు ఆలయానికి వచ్చి కార్తిక పూజలు చేశారు.
నవంబర్ 14 నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు నెలరోజుల పాటు జరిగిన పూజల ద్వారా, భక్తులు సమర్పించుకున్న కానుకల హుండీని లెక్కించారు. ఆలయ చైర్మన్ తటాకం రమేశ్ శర్మ, దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బందితో పాటు భక్తులు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. స్వామివారి టికెట్ల రూపేణా రూ. 83,93,603 లక్షలు, హుండీ ద్వారా రూ. 22 ,78, 236లక్షలు మొత్తం రూ. కోటి 6,71,839 ఆదాయం వచ్చిందని ఆలయ చైర్మన్ వెల్లడించారు.