కాచిగూడ, ఏప్రిల్ 22: గుట్టుచప్పుడు కాకుండాఇంట్లో ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న వ్యక్తులను కాచిగూడ పోలీసులు అరెస్టు చే శారు. అడ్మిన్ ఎస్సై పి. రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్ ప్రాంతానికి చెందిన శ్యామ్, కాచిగూడలోని ఇసామియాబజార్ ప్రాంతానికి చెందిన రాజు, ముఖేశ్లు నిబంధనలకు విరుద్ధంగా ము గ్గురు ఆన్లైన్లో కొన్ని రోజులుగా ఇసామియాబజార్లోని ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాత్రి ఇంట్లో సోదాలు చేయగా శ్యామ్, రాజు, ముఖేశ్ దగ్గర రూ.42 వేలు, నాలుగు ఫోన్లు దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకొని, తదుపరి విచారణ నిమిత్తం కాచిగూడ పోలీసులకు అప్పగించారు. శనివారం శ్యామ్, రాజు, ముఖేశ్లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.