Accident | మియాపూర్, మార్చి 17 : హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పార్మా కంపెనీకి చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలవ్వగా.. మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు.
లీ ఫార్మా కంపెనీకి చెందిన మినీ బస్సు మంగళవారం ఉదయం 80 గంటలకు 10 మంది ఉద్యోగులతో కేపీహెచ్బీ నుంచి గడ్డిపోతారం బయల్దేరింది. 8.30 గంటల సమయంలో మియాపూర్ చౌరస్తా నుంచి బాచుపల్లి వెళ్లే మార్గంలో బీకే ఎన్క్లేవ్ సమీపంలో యూటర్న్ వద్ద రెండు బస్సులు సమాంతరంగా వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఓ బస్సును ఆకస్మికంగా కుడి వైపునకు తిప్పారు. దీంతో లీ ఫార్మాకు చెందిన బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి అవతలివైపు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సు ముందు సీటులో కూర్చున్న వ్యక్తి తలకు గాయాలయ్యాయి. మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు.
రహదారిపై బస్సు బోల్తా పడటంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్రేన్ సాయంతో బస్సును పైకి లేపి, పక్కకు తీసుకెళ్లారు. అనంతరం ట్రాఫిక్ను పునరుద్ధరించారు.